ఢిల్లీకి బయల్దేరిన రేవంత్ రెడ్డి
- సాయంత్రం ఏఐసీసీ పెద్దలతో భేటీ కానున్న రేవంత్
- పెండింగ్ లో ఉన్న మూడు లోక్ సభ స్థానాలకు అభ్యర్థుల ఎంపిక
- ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత ప్రచారాన్ని ముమ్మరం చేయనున్న రేవంత్
ఢిల్లీ పర్యటనను ముగించుకుని వచ్చిన తర్వాత రేవంత్ ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేయనున్నారు. మొత్తం 17 లోక్ సభ స్థానాల్లో 10కి పైగా స్థానాల్లో విజయం సాధించి సత్తా చాటాలని కాంగ్రెస్ పట్టుదలతో ఉంది. శాసనసభ ఎన్నికల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కాంగ్రెస్ పెద్దగా ప్రభావం చూపలేకపోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, లోక్ సభ ఎన్నికల్లో గ్రేటర్ పరిధిలో సత్తా చాటాలని రేవంత్ కృతనిశ్చయంతో ఉన్నారు.