ప్రజల నుంచి నాకు మంచి స్పందన వస్తోంది: సుజనా చౌదరి
రాజ్యసభ మాజీ సభ్యుడు సుజనా చౌదరి విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి బీజేపీ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈరోజు ఆయన విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఉగాది పర్వదినం సందర్భంగా పంచాంగ శ్రవణం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... పశ్చిమ నియోజకవర్గం ప్రజల కోసం తాను కష్టపడి పని చేస్తానని చెప్పారు. ప్రజల నుంచి తనకు మంచి ప్రతిస్పందన వస్తోందని తెలిపారు. నియోజకవర్గంలో మౌలిక సదుపాయాలను పెంపొందించాల్సిన అవసరం ఉందని చెప్పారు.
తన దృష్టికి ఏ సమస్య వచ్చినా పరిష్కరిస్తాననే నమ్మకం తనకు ఉందని అన్నారు. కేంద్ర - రాష్ట్ర ప్రభుత్వాల నెట్ వర్క్ కి సంబంధించి తనకు అవగాహన ఉందని ... ఆ పరిజ్ఞానాన్ని నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడానికి ఉపయోగిస్తానని చెప్పారు. ఈ ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించబోతోందని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజల సంక్షేమానికి బీజేపీ కట్టుబడి ఉందని చెప్పారు.
తన దృష్టికి ఏ సమస్య వచ్చినా పరిష్కరిస్తాననే నమ్మకం తనకు ఉందని అన్నారు. కేంద్ర - రాష్ట్ర ప్రభుత్వాల నెట్ వర్క్ కి సంబంధించి తనకు అవగాహన ఉందని ... ఆ పరిజ్ఞానాన్ని నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడానికి ఉపయోగిస్తానని చెప్పారు. ఈ ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించబోతోందని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజల సంక్షేమానికి బీజేపీ కట్టుబడి ఉందని చెప్పారు.