ధోనీ మేనియా.. దెబ్బకు చెవులు మూసుకున్న రసెల్.. వీడియో ఇదిగో!
- కోల్కతాతో మ్యాచ్లో ఘటన
- ధోనీ క్రీజులోకి రాగానే ధోనీ.. ధోనీ అంటూ అభిమానుల అరుపులు
- అరుపుల శబ్దం 125 డెసిబుల్స్ దాటిన వైనం
- శబ్దాన్ని భరించలేక చెవులు మూసుకున్న ఆండ్రీ రసెల్
అభిమానుల అరుపుల శబ్దం 125 డెసిబుల్స్ దాటినట్టు బ్రాడ్కాస్టర్లు స్క్రీన్పై ప్రదర్శించారు. సీఎస్కే డ్రెసింగ్ రూము నుంచి ధోనీ బయటకు వచ్చి క్రీజులోకి వెళ్లాక కూడా అభిమానుల కేరింతలు ఆగలేదు సరికదా, మరింత ఎక్కువయ్యాయి. ఈ మ్యాచ్లో కోల్కతా వరుస విజయాలకు కళ్లెం వేసిన చెన్నై ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించి టోర్నీలో మూడో గెలుపును సొంతం చేసుకుంది. నాలుగు మ్యాచ్లు ఆడి నాలుగింటిలోనూ గెలిచిన రాజస్థాన్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది.