క్యూఆర్ కోడ్ను అందుబాటులోకి తీసుకొచ్చిన రైల్వే శాఖ
- పైలెట్ ప్రాజెక్టులో భాగంగా పలు రైల్వే స్టేషన్ల బుకింగ్ కౌంటర్ల వద్ద ఏర్పాటు
- విజయవాడ రైల్వే డివిజన్ పరిధిలోని పలు స్టేషన్లలో అందుబాటులోకి తెచ్చిన అధికారులు
- ప్రయాణీకులు జనరల్ టికెట్ను యూపీఐ పేమెంట్ల ద్వారా సులభంగా కొనుగోలు చేసే అవకాశం
డిజిటల్ చెల్లింపుల విధానం అమల్లోకి రావడంతో ప్రయాణీకులు నగదు అవసరం లేకుండానే క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి యూపీఐ పేమెంట్లు చేయవచ్చు. రైల్వే టికెటింగ్ ఉద్యోగి ఎంటర్ చేసిన వివరాలను బుకింగ్ కౌంటరు ముందు ఏర్పాటు చేసిన స్కీన్పై ప్రయాణికుడు పరిశీలించుకోవచ్చు. ఇక అదే స్క్రీన్పై ఉన్న క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి పేమెంట్ యాప్ ద్వారా చెల్లింపులు చేయవచ్చు. దీంతో జనరల్ టికెట్ జారీ అవుతుంది. దీంతో రైల్వే జనరల్ టికెట్ల కొనుగోలు మరింత సులభతరం కానుంది. అంతేకాకుండా డిజిటల్, నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించేందుకు ఈ విధానం తోడ్పాటు ఇవ్వనుంది.