నియోజకవర్గం అభివృద్ధి కోసమే కాంగ్రెస్లో చేరాను: కడియం శ్రీహరి
- కూతురు కావ్యతో కలిసి వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆర్ నాగరాజును కలిసిన కడియం శ్రీహరి
- కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని వెల్లడి
- లౌకికవాదాన్ని నిలబెట్టుకోవాలని కాంగ్రెస్ పార్టీలో చేరానన్న కడియం శ్రీహరి
ఎమ్మెల్యే ఆర్ నాగరాజు మాట్లాడుతూ... ప్రజలను మరోసారి మోసం చేసేందుకే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జిల్లాల పర్యటనకు వస్తున్నారని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఆయనకు ఏటీఎంలా మారిందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రైతులను పట్టించుకోలేదన్నారు. తెలంగాణలో ప్రస్తుత కరవు పరిస్థితులకు గత బీఆర్ఎస్ ప్రభుత్వమే కారణమని ఆరోపించారు. బీఆర్ఎస్ నాయకులు ధర్నా చేస్తే ప్రజలు తరిమికొట్టడం ఖాయమని హెచ్చరించారు.