BJP: ముగ్గురు అభ్యర్థులతో బీజేపీ ఆరో జాబితా విడుదల

  • రాజస్థాన్ నుంచి రెండు, మణిపూర్ నుంచి ఒక స్థానానికి అభ్యర్థుల ప్రకటన
  • రాజ‌స్ధాన్‌లోని దౌసా నుంచి క‌న్హ‌య్య లాల్ మీనా, క‌రౌలీ ధోల్పూర్ నుంచి ఇందూ దేవి పేర్లను ప్రకటించిన బీజేపీ
  • ఇన్నర్ మణిపూర్ స్థానం నుంచి బరిలో తౌనౌజామ్ బసంత్ కుమార్ సింగ్
BJP 6th candidate list released

లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులతో కూడిన ఆరో జాబితాను బీజేపీ మంగళవారం విడుదల చేసింది. ఈ జాబితాలో రాజ‌స్ధాన్, మ‌ణిపూర్ రాష్ట్రాల‌కు చెందిన ముగ్గురు అభ్య‌ర్ధుల‌కు చోటు క‌ల్పించింది. రాజస్థాన్ నుంచి రెండు, మణిపూర్ నుంచి ఒక పేరును ప్రకటించింది. రాజ‌స్ధాన్‌లోని దౌసా నియోజ‌కవ‌ర్గం నుంచి క‌న్హ‌య్య లాల్ మీనా, క‌రౌలీ ధోల్పూర్ నుంచి ఇందూ దేవి జాట‌వ్‌ల‌ను బరిలో దింపింది.

ఇన్నర్ మణిపూర్ స్థానం నుంచి తౌనౌజామ్ బసంత్ కుమార్ సింగ్‌ను పోటీలో నిలిపింది. రాజ‌స్ధాన్‌లో 25 లోక్ స‌భ స్ధానాలుండ‌గా ఏప్రిల్ 19న తొలి ద‌శ‌లో 12 స్ధానాల‌కు, మిగిలిన 13 స్ధానాల్లో ఏప్రిల్ 26న రెండో ద‌శ‌లో పోలింగ్ జ‌రుగుతుంది. మ‌ణిపూర్‌లో ఏప్రిల్ 19, 26 తేదీల్లో రెండు ద‌శ‌ల్లో పోలింగ్ జ‌ర‌గ‌నుంది.

More Telugu News