Narendra Modi: మన ప్రజాస్వామ్యానికి ఒక ‘నకిలీ రంగు‘ అంటుకుంది: తెలంగాణ కాంగ్రెస్

  • హోలీ సందర్భంగా మోదీపై సెటైరికల్ ట్వీట్
  • నకిలీ రంగు ప్రజాస్వామ్య వ్యవస్థను నిర్వీర్యం చేస్తోందన్న టీకాంగ్రెస్
  • ఓటు అనే ఆయుధంతో నకిలీ రంగు నుంచి దేశాన్ని కాపాడాలని పిలుపు
Telangana Congress satirical tweet on Modi on the occasion of Holi

హోలీ పండుగ సందర్భంగా ప్రధాని మోదీపై తెలంగాణ కాంగ్రెస్ సెటైరికల్ ట్వీట్ చేసింది. మోదీని ఉద్దేశిస్తూ... మన ప్రజాస్వామ్యానికి ఒక నకిలీ రంగు అంటుకుందని విమర్శించింది. ఆ నకిలీ రంగు ఏకంగా ప్రజాస్వామ్య వ్యవస్థనే నిర్వీర్యం చేసి, దేశాన్ని నియంతృత్వం వైపు నడిపించే దిశగా సాగుతోందని దుయ్యబట్టింది. ఇకనైనా ప్రజలంతా మేల్కొనాలని... ఈ నకిలీ రంగు ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని చెప్పింది. మీ ఓటు అనే ఆయుధంతో ఈ నకిలీ రంగు నుంచి మన దేశాన్ని కాపాడాలని, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని కోరింది. 

More Telugu News