Congress: ఏప్రిల్ మొదటి వారంలో తుక్కుగూడలో కాంగ్రెస్ భారీ బహిరంగ సభ

  • సభకు హాజరుకానున్న మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ
  • కాంగ్రెస్ మేనిఫెస్టోను తెలుగులో విడుదల చేయనున్న ఖర్గే
  • ఈ సభ నుంచి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తున్నట్లు వెల్లడి
Congress public meeting in April first week in Thukkuguda

తెలంగాణ కాంగ్రెస్ తుక్కుగూడలో భారీ బహిరంగ సభ నిర్వహించనుంది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ అగ్రనాయకుడు రాహుల్ గాంధీలతో పాటు పలువురు ముఖ్య నాయకులు ఈ సభలో పాల్గొననున్నట్లు తెలిపింది. ఈ సభను ఏప్రిల్ మొదటి వారంలో నిర్వహించాలని నిర్ణయించింది. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను ఇటీవల విడుదల చేశారు. అయితే ఈ సభలో ఈ మేనిఫెస్టోను తెలుగులో మల్లికార్జున ఖర్గే విడుదల చేయనున్నారు. ఎన్నికల షెడ్యూల్ తర్వాత ఏర్పాటు చేస్తున్న ఈ సభ నుంచి ఎన్నికల ప్రచారాన్ని మొదలు పెడుతున్నట్లు కాంగ్రెస్ తెలిపింది. ఈ మేరకు సీఎం, పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఇతర ముఖ్య నాయకులు కలిసి నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.

More Telugu News