K Kavitha: కవిత బెయిల్ పిటిషన్‌పై ఈడీకి నోటీసులు జారీ చేసిన రౌస్ అవెన్యూ కోర్టు

  • రౌస్ అవెన్యూ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన కవిత
  • విచారణకు స్వీకరించిన న్యాయస్థానం
  • కౌంటర్ దాఖలు చేయాలని ఈడీకి నోటీసులు
Court accepted kavitha bail petition

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను రౌస్ అవెన్యూ సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం విచారణకు స్వీకరించింది. తనకు బెయిల్ ఇవ్వాలని, ఈడీకి నోటీసులు జారీ చేయాలని ఆమె తరఫున న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు. ఈపిటిషన్‌ను స్వీకరించిన న్యాయస్థానం... కౌంటర్ దాఖలు చేయాలని ఈడీకి నోటీసులు జారీ చేసింది. ఈ నెల 26వ తేదీన న్యాయస్థానం ఈ పిటిషన్‌పై విచారణ జరపనుంది. కవిత తరఫున బెయిల్ పిటిషన్ దాఖలు చేశామని కవిత తరఫు న్యాయవాది తెలిపారు. కవితను ఐటీ వివరాలు అడుగుతున్నారని, ఆమె ఈడీ కస్టడీలో ఉంటే ఎలా ఇస్తారని న్యాయవాది ప్రశ్నించారు.

More Telugu News