35 మంది సముద్రపు దొంగలతో ముంబై చేరుకున్న భారత యుద్ధనౌక
- ఈ నెల 15న పైరేట్ల ఆటకట్టించిన భారత యుద్ధనౌక ఐఎన్ఎస్ కోల్కతా
- 40 గంటల ఆపరేషన్ తర్వాత 35 మంది సముద్రపు దొంగలను బంధించిన నేవీ
- ముంబై పోలీసులకు పైరేట్ల అప్పగింత
ఈ నెల 15న అరేబియా సముద్రంలో పైరేట్ల నౌక ఎక్స్-ఎంవీ రూయెన్ను అడ్డగించిన భారత నౌక ఐఎన్ఎస్ కోల్కతా 40 గంటల ఆపరేషన్ అనంతరం 35 మంది సముద్రపు దొంగలను బంధించింది. ఈ ఆపరేషన్లో ఐఎన్ఎస్ కోల్కతాకు సాయంగా ఐఎన్ఎస్ సుభద్ర కూడా చేరింది. ఈ రెండింటికి సపోర్టుగా భారత వాయుసేన కూడా రంగంలోకి దిగడంతో ఆపరేషన్ మరింత ఈజీగా ముగిసింది. 35 మంది పైరేట్లతో అక్కడి నుంచి బయలుదేరిన నౌక ఈ ఉదయం ముంబై తీరం చేరుకుంది.