Keshav Maharaj: అయోధ్య రామ‌మందిరాన్ని సంద‌ర్శించిన‌ ద‌క్షిణాఫ్రికా స్టార్ క్రికెట‌ర్‌

  • అయోధ్య బాల రాముడిని ద‌ర్శించుకున్న‌ కేశ‌వ్ మహారాజ్ 
  • తొలిసారి ఐపీఎల్ బ‌రిలోకి ద‌క్షిణాఫ్రికా క్రికెట‌ర్‌ 
  • ఈ ప్రొటీస్ క్రికెట‌ర్‌ను వేలం రూ.50ల‌క్ష‌ల క‌నీస ధ‌ర‌కు ద‌క్కించుకున్న ల‌క్నో సూప‌ర్ జెయింట్స్
  • ఈ నెల 24న రాజ‌స్థాన్ రాయ‌ల్స్‌తో ల‌క్నో తొలి మ్యాచ్‌  
Keshav Maharaj Visits Ayodhya Rama mandir

ద‌క్షిణాఫ్రికా స్టార్ క్రికెట‌ర్ కేశ‌వ్ మహారాజ్ తొలిసారి ఐపీఎల్ బ‌రిలోకి దిగుతున్నాడు. గ‌తేడాది దుబాయి వేదిక‌గా జ‌రిగిన మినీ వేలంలో ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ (ఎల్ఎస్‌జీ) ఈ దక్షిణాఫ్రికా ప్లేయ‌ర్‌ను రూ.50ల‌క్ష‌ల క‌నీస ధ‌ర‌కు ద‌క్కించుకుంది. దీంతో ఇప్ప‌టికే ల‌క్నో జ‌ట్టుతో అత‌డు క‌లిశాడు. ప్ర‌స్తుతం ఎల్ఎస్‌జీ ల‌క్నోలోని ఏక్నాస్టేడియంలో ప్రాక్టీస్ చేస్తోంది. ఈ క్ర‌మంలో కేశ‌వ్ మ‌హారాజ్ గురువారం అయోధ్య రామ‌మందిరాన్ని సంద‌ర్శించాడు. 

మందిరంలో బాల రాముడిని ద‌ర్శించుకున్నాడు. ఆ స‌మ‌యంలో తీసిన ఫొటోను సోష‌ల్ మీడియా ద్వారా అభిమానుల‌తో పంచుకున్నాడు. ప్ర‌స్తుతం ఈ ఫొటో నెట్టింట వైర‌ల్ అవుతోంది. కాగా, భార‌త సంత‌తికి చెందిన కేశ‌వ్ మ‌హారాజ్ రామ‌భ‌క్తుడు. అందుకే ఇవాళ ప్ర‌త్యేకంగా అయోధ్య రాముడిని ద‌ర్శించుకోవ‌డం జ‌రిగింది. కాగా, ఈ 17వ సీజ‌న్‌లో ఎల్ఎస్‌జీ త‌న తొలి మ్యాచ్‌ను ఈ నెల 24వ తేదీన రాజ‌స్థాన్ రాయ‌ల్స్‌తో ఆడ‌నుంది.

View this post on Instagram

A post shared by Keshav Maharaj (@keshavmaharaj16)

More Telugu News