ఉద్యోగులకు హెచ్ఆర్ఏను సవరించిన టీఎస్ఆర్టీసీ

టీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్త. ఉద్యోగులకు హెచ్ఆర్ఏను ఆర్టీసీ యాజమాన్యం సవరించింది. జీవో నెంబర్ 53 ప్రకారం హెచ్ఆర్ఏ సవరణ చేయాలని 2020లో ఆర్టీసీ యాజమాన్యాన్ని ప్రభుత్వం ఆదేశించింది. అప్పుడు ఆర్టీసీ ఉద్యోగుల పే-రివిజన్ చేయకపోవడంతో హెచ్‌ఆర్‌ఏ సవరణను ఆర్టీసీ తాత్కాలికంగా నిలిపివేసింది. ఇటీవల 2017 పే-స్కేల్‌ని రివిజన్ చేసి ఉద్యోగులకు 21 శాతం ఫిట్‌మెంట్‌ను ఆర్టీసీ యాజమాన్యం ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే జీవో నంబర్ 53 ప్రకారం... ఉద్యోగుల హెచ్‌ఆర్‌ఏపై యాజమాన్యం నిర్ణయం తీసుకుంది.


More Telugu News