Ch Malla Reddy: మాజీ మంత్రి మల్లారెడ్డికి మరోసారి షాక్ ఇచ్చిన ఐటీ

  • మేనేజ్ మెంట్ కోటా సీట్లను ఎక్కువ మొత్తానికి అమ్ముకుంటున్నారని ఆరోపణలు
  • సీట్లను ఎంతకు అమ్ముకున్నారనే దానిపై ఆరా తీస్తున్న ఐటీ
  • రికార్డులను స్వాధీనం చేసుకున్న అధికారులు
IT raids on Ex minister Malla Reddy

బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి మల్లారెడ్డిపై ఐటీ శాఖ మరోసారి పంజా విసిరింది. మల్లారెడ్డి కాలేజీల్లో మేనేజ్ మెంట్ కోటా సీట్లను ఎక్కువ ఫీజుకు యాజమాన్యం అమ్ముకుంటోందనే ఆరోపణలు రావడంతో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. మల్లారెడ్డి అగ్రికల్చర్ యూనివర్శిటీలో 40 మంది విద్యార్థులను డిటైన్ చేయడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. లాభాపేక్ష కోసం విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారంటూ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లెక్కల్ని రికార్డుల్లో సక్రమంగా చూపించడం లేదనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. 

మేనేజ్ మెంట్ కోటా సీట్లను ఎంతకు అమ్ముకున్నారనే దానిపై ఐటీ అధికారులు ప్రధానంగా ఆరా తీస్తున్నారు. ఏ విద్యార్థి ఎంత ఫీజు కట్టాడనే దానిపై ఫోకస్ పెట్టారు. కాలేజీ రికార్డులను స్వాధీనం చేసుకున్న ఐటీ అధికారులు... వాటిని తమ కార్యాలయానికి తీసుకెళ్లారు. ఇప్పటికే కాలేజీ మేనేజ్ మెంట్, సిబ్బందిని ఐటీ అధికారులు ప్రశ్నించారు. బంధువుల పేర్లతో ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నట్టు ఇప్పటికే గుర్తించినట్టు సమాచారం.

More Telugu News