gold: మిర్యాలగూడలో రూ.5 కోట్ల బంగారం పట్టివేత

  • లోక్ సభ ఎననికల నేపథ్యంలో అమల్లోకి వచ్చిన ఎన్నికల కోడ్
  • ఎక్కడికక్కడ వాహనాలను తనిఖీ చేస్తున్న పోలీసులు
  • మిర్యాలగూడ నుంచి కోదాడ వెళ్తున్న బొలెరోలో భారీగా బంగారం పట్టివేత

మిర్యాలగూడలో కోట్లాది రూపాయల బంగారం పట్టుకున్నారు. లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఎక్కడికక్కడ వాహనాలను తనిఖీ చేస్తున్నారు. నల్గొండ జిల్లా ఈదులగూడ చౌరస్తా వద్ద పోలీసులు సోమవారం తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో మిర్యాలగూడ నుంచి కోదాడ వైపు వెళ్తున్న బొలెరో వాహనంలో రూ.5.73 కోట్ల విలువ చేసే బంగారాన్ని గుర్తించారు. వాహనంలోని ముగ్గురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బంగారం, బొలెరో వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.

More Telugu News