స్మృతి మంధానకు విరాట్ కోహ్లీ వీడియో కాల్
- డబ్ల్యూపీఎల్ తొలి టైటిల్ గెలిచిన జట్టుకి అభినందనలు తెలిపిన కింగ్
- ‘సూపర్ వుమెన్స్' అంటూ ఇన్స్టాలోనూ ప్రశంసించిన కోహ్లీ
- డబ్ల్యూపీఎల్ ట్రోఫీని తొలిసారి గెలిచిన ఆర్సీబీ ఉమెన్స్ జట్టు
కాగా ఆదివారం ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా డబ్ల్యూపీఎల్ ఫైనల్ మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ ఉమెన్స్, ఆర్సీబీ ఉమెన్స్ జట్లు తలపడ్డాయి. ఢిల్లీపై ముంబై 8 వికెట్ల తేడాతో విజయం సాధించి టైటిల్ను ఎగరేసుకుపోయింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ 18.3 ఓవర్లలో 113 పరుగులకు ఆలౌట్ అయ్యింది. మరో మూడు బంతులు మిగిలివుండగానే ఆర్సీబీ లక్ష్యాన్ని ఛేదించింది. స్మృతి మంధాన (31), సోఫి (32), ఎల్లీస్ పెర్రీ (35 నాటౌట్) ఆర్సీబీ గెలుపులో కీలక పాత్ర పోషించారు. కాగా ఐపీఎల్ 2008లో ఆరంభమవ్వగా ఆర్సీబీ పురుషుల జట్టు ఇప్పటికి ఒక్కసారి కూడా టైటిల్ను గెలుచుకోలేకపోయింది. ఆ జట్టు టైటిల్ను గెలవడం ఇంకా ఒక కలగానే ఉందన్న విషయం తెలిసిందే.