ఈఎస్ఐసీ కేసులో జయప్రదకు జైలుశిక్షను కొట్టివేసిన సుప్రీంకోర్టు
- జయప్రదపై ఫిర్యాదు చేసిన థియేటర్ కార్మికులు
- బీమా సొమ్ము రూ.8,17,794 ఎగవేతకు పాల్పడినట్టు ఆరోపణ
- ఈ కేసులో జయప్రదకు ఆర్నెల్ల జైలుశిక్ష విధించిన ఎగ్మోర్ కోర్టు
- ఎగ్మోర్ కోర్టు తీర్పును సమర్థించిన మద్రాస్ హైకోర్టు
- సుప్రీంకోర్టును ఆశ్రయించిన జయప్రద
థియేటర్ ఉద్యోగులకు జయప్రద ఈఎస్ఐసీ (ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ స్కీమ్) కింద రూ.8,17,794 చెల్లించాల్సి ఉండగా... జయప్రద నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడినట్టు థియేటర్ కార్మికులు ఫిర్యాదు చేశారు. దాంతో జయప్రద పైనా, ఆమె సోదరుడు రాజబాబు, బిజినెస్ పార్టనర్ రామ్ కుమార్ పైనా కేసు నమోదైంది. ఈ కేసులోనే ఎగ్మోర్ మెట్రోపాలిటన్ కోర్టు ఆరు నెలల శిక్ష విధించింది.