Narendra Modi: ఎల్లుండి చిలకలూరిపేటలో భారీ సభ... ప్రధాని మోదీ షెడ్యూల్ ఖరారు

  • ప్రజాగళం సభ ఏర్పాటు చేసిన బీజేపీ-టీడీపీ-జనసేన
  • కూటమి ఏర్పడ్డాక తొలి సభ
  • హాజరవుతున్న ప్రధాని మోదీ
  • ప్రధాని వస్తుండడంతో ప్రజాగళం సభకు అత్యంత ప్రాధాన్యం 
PM Modi schedule finalised for Praja Galam meeting at Chilakaluripet

ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన పార్టీల కూటమి ఈ నెల 17న చిలకలూరిపేట మండలం బొప్పూడి వద్ద ప్రజాగళం పేరిట భారీ బహిరంగ సభ నిర్వహిస్తోంది. మూడు పార్టీలు కూటమిగా ఏర్పడ్డాక నిర్వహిస్తున్న ఈ తొలి సభకు ప్రధాని నరేంద్ర మోదీ హాజరవుతున్నారు. ఈ సభకు హాజరయ్యేందుకు మోదీ షెడ్యూల్ ఖరారైంది. 

ఎల్లుండి సాయంత్రం 4.10 గంటలకు ప్రధాని విజయవాడ రానున్నారు. గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి హెలికాప్టర్ లో బొప్పూడి చేరుకుంటారు. హెలీప్యాడ్ నుంచి రోడ్డు మార్గం ద్వారా ఆయన సభా వేదిక వద్దకు చేరుకోనున్నారు. ఈ ప్రజాగళం సభలో మోదీ సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల వరకు పాల్గొంటారు. సాయంత్రం 6.10 గంటలకు హెలీప్యాడ్ వద్దకు చేరుకుంటారు. సాయంత్రం 6.55 గంటలకు తిరిగి గన్నవరం ఎయిర్ పోర్టుకు రానున్నారు. అదే రోజు రాత్రి 7 గంటలకు హైదరాబాద్ బయలుదేరనున్నారు.

More Telugu News