U-1 Zone: అమరావతిలో యూ-1 జోన్ ఎత్తివేసిన ఏపీ ప్రభుత్వం

  • గత ప్రభుత్వ హయాంలో యూ-1 జోన్ ప్రకటన
  • యూ-1 జోన్ లో ఉన్న భూముల క్రయవిక్రయాలు నిషిద్ధం
  • ఆందోళన చేపట్టిన రైతులు
  • జోన్ ఎత్తివేస్తున్నట్టు నేడు గెజిట్ విడుదల చేసిన వైసీపీ సర్కారు 
AP Govt revokes U1 zone in Amaravathi

మరి కొన్ని రోజుల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఏపీ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. ఎలాంటి షరతులు లేకుండా అమరావతిలో యూ-1 జోన్ ఉపసంహరించుకుంది. యూ-1 జోన్ ఎత్తివేస్తున్నట్టు నేడు గెజిట్ విడుదల చేసింది. 

అమరావతి ప్రాంతంలోని 178 ఎకరాల భూమిని రాజధాని అవసరాల నిమిత్తం నాడు యూ-1 జోన్ గా ప్రకటించారు. యూ-1 జోన్ లో ఉన్న ఆస్తుల అమ్మకం, కొనుగోలు, ఆ భూముల రిజిస్ట్రేషన్లు నిషిద్ధం. తాము అధికారంలోకి వచ్చాక యూ-1 జోన్ ఎత్తివేస్తామని 2019 ఎన్నికల వేళ వైసీపీ హామీ ఇచ్చింది. యూ-1 జోన్ ఎత్తివేత కోసం రైతులు 140 రోజుల పాటు  దీక్ష చేపట్టారు. 

ఇటీవలే జయహో బీసీ సభలోనూ టీడీపీ అధినేత చంద్రబాబు యూ-1 జోన్ అంశాన్ని ప్రస్తావించారు. అధికారంలోకి రాగానే యూ-1 జోన్ ఎత్తివేస్తామని హామీ ఇచ్చారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కూడా ఇదే హామీ ఇచ్చారు. అయితే, ఈలోపే వైసీపీ సర్కారు యూ-1 జోన్ ను వెనక్కి తీసుకుంది.

  • Loading...

More Telugu News