Hyderabad: సికింద్రాబాద్‌లో భారీ అగ్ని ప్రమాదం

  • ఇన్‌క్రెడిబుల్ ఇండియా కార్యాలయంలో హఠాత్తుగా ఎగిసిన మంటలు
  • షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు రేగినట్టు ప్రాథమికంగా గుర్తింపు
  • మంటలు ఆర్పివేస్తున్న ఫైరింజన్ సిబ్బంది

సికింద్రాబాద్‌లోని మారేడ్‌పల్లిలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. గురువారం మధ్యాహ్నం ఇన్‌క్రెడిబుల్ ఇండియా కార్యాలయంలో హఠాత్తుగా మంటలు ఎగిసిపడ్డాయి. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు వచ్చినట్లు ప్రాథమికంగా గుర్తించారు. ఇన్‌క్రెడిబుల్ ఇండియా కార్యాలయంతో పాటు ఆ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో దట్టమైన పొగలు అలముకున్నాయి. దీంతో కార్యాలయాల నుంచి స్థానికులు భయంతో బయటకు పరుగులుతీశారు. విషయం తెలిసిన పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని, ఫైరింజన్ల సాయంతో మంటలు ఆర్పివేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు.

More Telugu News