బీజేపీ నేత జితేందర్ రెడ్డి ఇంటికి వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి... కాంగ్రెస్లోకి ఆహ్వానం
- బీజేపీలో మహబూబ్ నగర్ లోక్ సభ స్థానం ఆశించి భంగపడ్డ జితేందర్ రెడ్డి
- ఈ సీటును డీకే అరుణకు కేటాయించిన బీజేపీ
- త్వరలో కాంగ్రెస్లోకి జితేందర్ రెడ్డి?
లోక్ సభ ఎన్నికలకు ముందు బీజేపీకి ఆయన షాకిచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్లో చేరేందుకు ఆయన కూడా సుముఖంగా ఉన్నట్లుగా ప్రచారం సాగుతోంది. బీజేపీ తన రెండో జాబితాను నిన్న సాయంత్రం విడుదల చేసింది. ఇందులో మహబూబ్ నగర్ ను డీకే అరుణకు కేటాయించింది. జితేందర్ రెడ్డి కూడా ఈ స్థానం నుంచి పోటీ చేయాలని ఆసక్తితో ఉన్నారు. 2014లో బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి ఆయన గెలిచారు.