Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి కాన్వాయ్ ఢీకొని పోలీస్ అధికారికి గాయాలు

  • కొత్తగూడెం భద్రాద్రి జిల్లాలో ఘటన
  • రేవంత్ రెడ్డి కాన్వాయ్ ఢీకొని భద్రాచలం ఏఎస్పీ పారితోశ్ పంకజ్‌కు గాయాలు
  • పారితోశ్‌ను ఆసుపత్రికి తరలించిన అధికారులు

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాన్వాయ్ ఢీకొని భద్రాచలం ఏఎస్పీ పారితోశ్ పంకజ్‌కు గాయాలయ్యాయి. దీంతో అధికారులు ఆయనను ఆసుపత్రికి తరలించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు ఖమ్మం జిల్లాలో పర్యటిస్తున్నారు. ఉదయం యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకున్న రేవంత్ రెడ్డి ఆ తర్వాత భద్రాచలంలో శ్రీ సీతారామచంద్రస్వామిని దర్శనం చేసుకున్నారు. అనంతరం భద్రాచలంలో ఇందిరమ్మ ఇళ్లు పథకాన్ని ప్రారంభించారు. సాయంత్రం మణుగూరులో ప్రజాదీవెన సభ కార్యక్రమంలో పాల్గొన్నారు.

More Telugu News