లోక్ సభ ఎన్నికల్లో విశాఖ నుంచి పోటీ చేయాలనుకుంటున్నా: సీఎం రమేశ్
- విశాఖ ఎంపీ స్థానానికి బీజేపీ నేతల మధ్య పోటీ
- ఇప్పటికే విశాఖ పార్లమెంటు బరిలో క్రియాశీలకంగా ఉన్న జీవీఎల్
- తాను కూడా హైకమాండ్ కు విశాఖ స్థానంపై ప్రతిపాదన పంపానన్న సీఎం రమేశ్
తాను విశాఖ నుంచి లోక్ సభ బరిలో దిగాలని కోరుకుంటున్నానని తెలిపారు. ఇప్పటికే తన మనసులో మాటను పార్టీ హైకమాండ్ కు తెలియజేశానని, అగ్రనాయకత్వం ఏ నిర్ణయం తీసుకున్నా శిరోధార్యంగా భావిస్తానని వెల్లడించారు.
ఒకవేళ విశాఖ కాకున్నా, ఇతర ప్రాంతాల్లో పోటీ చేసేందుకైనా సిద్ధమని సీఎం రమేశ్ వివరించారు. మోదీ నాయకత్వంలో దేశం ప్రపంచంలోనే అగ్రగామిగా ఎదుగుతోందని కొనియాడారు.