TSPSC Groups: టీఎస్‌పీఎస్సీ గ్రూప్స్ అభ్యర్థులకు ఓ శుభవార్త!

  • గ్రూప్- 2,3 పోస్టుల సంఖ్య పెరిగే అవకాశం
  • అన్ని శాఖల్లో గ్రూప్ - 2,3 ఖాళీల వివరాలు తెలపాలంటూ శాఖాధిపతులను కోరిన ప్రభుత్వం
  • ఈ మేరకు గురువారం ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి ఆదేశాలు
ts govt may fill addtional posts in group 2 and 3

టీఎస్‌పీఎస్సీ గ్రూప్స్‌కు ప్రిపేర్ అవుతున్న వారికి ఓ శుభవార్త. గ్రూప్స్-2, 3 పోస్టుల సంఖ్య పెరిగే అవకాశం కల్పిస్తోంది. వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న గ్రూప్-2, 3 పోస్టుల వివరాలను ఆర్థిక శాఖకు అందించాలని అన్ని హెడ్ ఆఫ్ ది డిపార్టుమెంట్లను ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు సచివాలయంలో అన్ని శాఖలకు గురువారం ఆదేశాలు జారీ చేశారు. గ్రూప్-2లో 783 పోస్టులను, గ్రూప్-3లో 1388 పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం 2022లో నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే, కొత్తగా ఏర్పడిన ఖాళీలను కూడా భర్తీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇటీవల అదనపు పోస్టులతో గ్రూప్-1 నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే.

More Telugu News