Samantha at Tiruchanur Temple: పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న సమంత.. వీడియో ఇదిగో!

  • పుష్పగుచ్చంతో స్వాగతం పలికిన ఆలయ అధికారులు
  • మొక్కులు చెల్లించుకుని, పూజలు చేసిన హీరోయిన్
  • దివ్యాంగుడైన అభిమానితో సెల్ఫీ దిగిన సమంత
Actress Samantha Visited Sri Padmavati Ammavaari Temple In Tiruchanur

టాలీవుడ్ లో ప్రముఖ హీరోయిన్ భార్య సమంత సోమవారం తిరుచానూరు అమ్మవారిని దర్శించుకున్నారు. వ్యక్తిగత సహాయకులతో నిరాడంబరంగా గుడికి చేరుకున్న సమంతకు ఆలయ అధికారులు పుష్పగుచ్చంతో స్వాగతం పలికారు. సాదరంగా ఆలయంలోకి తీసుకెళ్లి పద్మావతి అమ్మవారి దర్శనం చేయించారు. ఈ సందర్భంగా అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్న హీరోయిన్.. ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారి పుష్పాంజలి సేవలో పాల్గొన్నారు. అమ్మవారి దర్శనానంతరం పూజారులు సమంతకు వేదాశీర్వాదం అందించారు. అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి, అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.
 
అనంతరం గుడిలో నుంచి బయటకు వచ్చిన సమంతను చూసేందుకు స్థానికులు ఎగబడ్డారు. సెల్ఫీలు తీసుకుంటూ సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఓ దివ్యాంగుడు సెల్ఫీ కోసం రాగా.. సమంత చిరునవ్వుతో పలకరించారు. అభిమానితో కలిసి సెల్ఫీ దిగారు. ఇటీవల అనారోగ్యం బారిన పడినట్లు వెల్లడించిన సమంత.. ప్రస్తుతం పూర్తిగా కోలుకున్నట్లు కనిపిస్తున్నారు.

More Telugu News