పిల్లలతో క్రికెటర్ గోలీలాట.. వీడియో ఇదిగో!
- అభిమానులతో కలిసి పిల్లాడిలా మారిన రిషబ్ పంత్
- కారు ప్రమాదంతో క్రికెట్ కు దూరమైన టీమిండియా ప్లేయర్
- ఐపీఎల్ కోసం నెట్ ప్రాక్టీస్.. మంగళవారం ఫిట్ నెస్ టెస్ట్
ఐపీఎల్ లో ఢిల్లీ జట్టుకు రిషబ్ పంత్ నాయకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. త్వరలో ఐపీఎల్ సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో పంత్ పూర్తిస్థాయిలో ప్రాక్టీస్ కే అంకితమయ్యాడు. ఫిట్ నెస్ కోసం జిమ్లో తీవ్రంగా శ్రమిస్తున్నాడు. కాగా, ఈ నెల 5న పంత్ ఫిట్ నెస్ టెస్టుకు హాజరుకానున్నాడని ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు డైరెక్టర్, టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ తెలిపారు. ఈ టెస్టులో పాస్ అయితే ఢిల్లీ జట్టు కెప్టెన్సీ బాధ్యతలు మళ్లీ పంత్ కు అప్పగించే విషయంపై చర్చిస్తామని వివరించారు.