Vani Kapoor: ఓటీటీ సెంటర్ కి వచ్చేస్తున్న 'మండాల మర్డర్స్'

  • వాణి కపూర్ నటించిన సిరీస్ 'మండాల మర్డర్స్'
  • క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో నడిచే కథ 
  • త్వరలో 'నెట్ ఫ్లిక్స్' ట్రాక్ పై స్ట్రీమింగ్
Mandala Murders Web Series

బాలీవుడ్ బ్యూటీగా వాణీ కపూర్ కి మంచి క్రేజ్ ఉంది. రొమాంటిక్ ఎంటర్టైనర్స్ జోనర్స్ సినిమాలతో ఈ భామ యూత్ కి బాగా చేరువైంది. అలాంటి ఆమె ప్రధానమైన పాత్రగా 'మండాల మర్డర్స్' వెబ్ సిరీస్ రూపొందింది. గోపీ పుత్రన్ దర్శకత్వం వహించిన ఈ సిరీస్, క్రైమ్ థ్రిల్లర్ జోనర్లో నడవనుంది. యశ్ రాజ్ ఫిలిమ్స్ వారు నిర్మించిన ఈ సిరీస్ ను, త్వరలో నెట్ ఫ్లిక్స్ వారు స్ట్రీమింగ్ చేయనున్నారు.
 
వాణీ కపూర్ తన కెరియర్లో చేసిన ఫస్టు సిరీస్ ఇది. కొంతకాలం క్రితం ఉత్తర ప్రదేశ్ లో జరిగిన యథార్థ సంఘటనల ఆధారంగా ఈ సిరీస్ ను రూపొందించారు. కథ ప్రకారం ఈ సిరీస్ ను లక్నో .. ప్రయాగ్ రాజ్ .. వారణాసి  ప్రాంతాల్లో చిత్రీకరించారు. మర్డర్ మిస్టరీని ఛేదించే డిటెక్టివ్ గా వాణి కపూర్ కనిపించనుంది.

రీసెంటుగా వాణి కపూర్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ .. " వెబ్ సిరీస్ చేయాలనే ఆలోచన కొంతకాలం క్రితమే కలిగింది. అయితే అందుకు సరైన కథ .. పాత్ర రావాలి అనే ఉద్దేశంతో వెయిట్ చేయడం మొదలు పెట్టాను. అలాంటి సమయంలో ఈ ప్రాజెక్టు నా దగ్గరికి వచ్చింది. నా నిరీక్షణ ఇంత త్వరగా ఫలిస్తోందని నేను ఎప్పుడూ అనుకోలేదు" అని చెప్పింది. 

More Telugu News