Atchannaidu: టీడీపీ-జనసేన సభ రాష్ట్ర చరిత్రలో నిలిచిపోతుంది: అచ్చెన్నాయుడు

  • తాడేపల్లిగూడెంలో టీడీపీ-జనసేన జెండా సభ
  • హాజరైన టీడీపీ, జనసేన అగ్రనేతలు
  • సిద్ధమా అని రోడ్డెక్కిన వ్యక్తిని ఓడించేందుకు తొలి అడుగు ఈ సభ అన్న అచ్చెన్న
  • టీడీపీ-జనసేన కూటమి 160 స్థానాల్లో గెలుస్తుందని ధీమా 
Atchnnaidu reiterates TDP and Jansena meeting will be historical

తాడేపల్లిగూడెంలో టీడీపీ-జనసేన పార్టీలు ఉమ్మడిగా నిర్వహిస్తున్న జెండా సభలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రసంగించారు. టీడీపీ-జనసేన సభ రాష్ట్ర చరిత్రలో నిలిచిపోతుందని అన్నారు. సిద్ధమా అని రోడ్డెక్కిన వ్యక్తిని యుద్ధం చేసి ఓడించేందుకు ఈ సభ తొలి అడుగు అని సమరశంఖం పూరించారు. అన్ని వర్గాల వారు టీడీపీ-జనసేన పొత్తును కోరుకున్నారని వివరించారు. కార్మికుడి నుంచి పారిశ్రామికవేత్త వరకు కోరుకున్న పొత్తు ఇది... జగన్ పాలనలో మోసపోయిన రైతులు, మహిళలు కోరుకున్న పొత్తు ఇది... రెండు పార్టీలు కలిసి పనిచేస్తే 160 స్థానాల్లో టీడీపీ-జనసేన కూటమి ఘనవిజయం సాధించడం ఖాయమని అచ్చెన్నాయుడు ధీమా వ్యక్తం చేశారు.

More Telugu News