Team India: రెండో ఇన్నింగ్స్ లో కుప్పకూలిన ఇంగ్లండ్... టీమిండియా టార్గెట్ 192

  • నాలుగో టెస్టులో గెలుపు దిశగా టీమిండియా
  • రెండో ఇన్నింగ్స్ లో 145 పరుగులకు ఇంగ్లండ్ ఆలౌట్
  • లక్ష్యఛేదనలో వికెట్ నష్టపోకుండా 40 పరుగులు చేసిన టీమిండియా
  • రాంచీ టెస్టులో ముగిసిన మూడో రోజు ఆట
England collapsed 145 runs in 2nd innings

రాంచీ టెస్టులో టీమిండియా గెలుపు దిశగా పయనిస్తోంది. టీమిండియా స్పిన్నర్లు రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్ ధాటికి ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్ లో 145 పరుగులకే ఆలౌట్ అయింది. అశ్విన్ 5, కుల్దీప్ 4 వికెట్లతో ఇంగ్లండ్ పనిబట్టారు. జడేజాకు 1 వికెట్ దక్కింది. ఇంగ్లండ్ ఇన్నింగ్స్ లో జాక్ క్రాలే 60, బెయిర్ స్టో 30 పరుగులు చేశారు. 

అనంతరం, 192 పరుగుల విజయలక్ష్యంతో బరిలో దిగిన టీమిండియా మూడో రోజు ఆట ముగిసే సమయానికి 8 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 40 పరుగులు చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ 24, యశస్వి జైస్వాల్ 16 పరుగులతో క్రీజులో ఉన్నారు. టీమిండియా గెలవాలంటే ఇంకా 152 పరుగులు చేయాలి. 

ఈ మ్యాచ్ లో ఇంగ్లండ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ లో 353 పరుగులు చేయగా... టీమిండియా 307 పరుగులకు ఆలౌట్ అయింది.

More Telugu News