APPSC: ఎస్బీఐ కీలక నిర్ణయం.. ఏపీపీఎస్సీ అభ్యర్థులకు ఊరట!

SBI allows APPSC candidates to write sbi exam on march 4
షార్ట్స్‌లో చూడండి
ఎస్బీఐ, ఏపీపీఎస్సీ పరీక్షలు ఒకే రోజు ఉంటాయని ఆందోళన చెందుతున్న అభ్యర్థులకు ఊరటనిచ్చేలా ఎస్బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. ఎస్బీఐ పరీక్షను మరో రోజు రాసేందుకు అనుమతించింది. మునుపటి షెడ్యూల్స్ ప్రకారం, ఏపీ గ్రూప్-2, ఎస్‌బీఐ క్లర్క్ (జూనియర్ అసోసియేట్స్) మెయిన్స్ పరీక్షలు ఈ నెల 25న ఉన్న విషయం తెలిసిందే. దీంతో, ఏపీపీఎస్సీ పరీక్ష తేదీ మార్చాలంటూ ఎస్బీఐకి లేఖ రాసింది. 

ఈ లేఖపై స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సానుకూలంగా స్పందించింది. ఈ నెల 25న గ్రూప్ - 2 పరీక్ష రాసే అభ్యర్థులు మార్చి 4న మెయిన్స్ పరీక్ష రాసేందుకు వీలు కల్పిస్తున్నట్టు వెల్లడించింది. పరీక్ష తేదీ మార్పు కోరుతున్న వారు ఫిబ్రవరి 23న ఉదయం 9 గంటల లోపు https://ibpsonline.ibps.in/sbijaoct23/ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని వెల్లడించింది.
Go Back to Shorts
APPSC
SBI
Recruitment
Andhra Pradesh

More Telugu News