Pawan Kalyan: వైజాగ్‌లో పార్టీ నేతలతో పవన్ సమావేశం

  • నగరంలోని నోవోటెల్‌లో ఉమ్మడి వైజాగ్ నేతలతో ఆదివారం రాత్రి సమావేశం
  • గంట పాటు వర్తమాన రాజకీయాలపై చర్చ
  • ఈ నెల 20న భీమవరంలో మరో సమావేశం
Pawan Kalyan meets with Janasena leaders in Vizag

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఉమ్మడి విశాఖలో పార్టీ నేతలతో సమావేశం నిర్వహించారు. నగరంలోని నోవోటెల్‌లో ఆదివారం రాత్రి సుమారు గంటపాటు ఈ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పలు వర్తమాన రాజకీయ అంశాలపై చర్చ జరిగినట్టు సమాచారం.

ఇదిలా ఉంటే, ఫిబ్రవరి 20న జనసేన అధినేత భీమవరానికి వస్తారని ఆ పార్టీ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుడు కొటికలపూడి గోవిందరావు ఓ ప్రకటనలో తెలిపారు. ‘భీమవరం సమీపంలో పెదఅమిరంలోని నిర్మలాదేవి కల్యాణ మండపంలో జనసేన, టీడీపీ ముఖ్యనాయకులతో పవన్ సమావేశమవుతారు. పొత్తు నేపథ్యంలో ఇరు పార్టీల వ్యూహాలపై చర్చిస్తారు. 21వ తేదీ సాయంత్రం తిరిగి మంగళగిరి వెళ్తారు’’ అని గోవిందరావు వెల్లడించారు.

More Telugu News