వైఎస్సార్ కూతురు కాబట్టే షర్మిలను బాపట్ల దాటనిచ్చాం: వైసీపీ ఎమ్మెల్యే కోన రఘుపతి
- బాపట్ల సభలో వైసీపీపై విరుచుకుపడ్డ షర్మిల
- వైఎస్ పై ఉన్న అభిమానంతో ఆమెను క్షమిస్తున్నామన్న కోన రఘుపతి
- మరో నేత అయితే బాపట్ల దాటేవారు కాదని వ్యాఖ్య
ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే కోన రఘుపతి మాట్లాడుతూ... తనపై, సీఎం జగన్ పై షర్మిల అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని అన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి కూతురు కాబట్టే ఆమెను బాపట్ల దాటనిచ్చామని చెప్పారు. వైఎస్ పై ఉన్న అభిమానంతో ఆమెను క్షమిస్తున్నామని అన్నారు. షర్మిల కాకుండా మరో నేత ఇలాంటి వ్యాఖ్యలు చేసి ఉంటే బాపట్ల దాటేవారు కాదని చెప్పారు. చంద్రబాబు, పవన్ ఇచ్చే హామీలను ప్రజలు నమ్మరని అన్నారు. ఎంతమంది నాయకులు వచ్చినా జగన్ ను చేసేదేమీ లేదని చెప్పారు.