Vishwambhara: 'విశ్వంభర' సెట్లో అడుగుపెట్టిన త్రిష .. వెల్ కమ్ చెప్పిన టీమ్!

  • చిరంజీవి తాజా చిత్రంగా 'విశ్వంభర'
  • షూటింగులో జాయినైన త్రిష
  • ఫాంటసీ జోనర్ ను టచ్ చేసే కంటెంట్ 
  • వచ్చే  ఏడాది జనవరి 10వ తేదీన విడుదల

Vishwambhara Movie Update

చిరంజీవి కథానాయకుడిగా శ్రీవశిష్ఠ దర్శకత్వంలో 'విశ్వంభర' సినిమా రూపొందుతోంది. ఈ సినిమాలో కథానాయికగా త్రిష కనిపించనుందనే టాక్ కొంతకాలంగా వినిపిస్తూ వస్తోంది .. చివరికి అదే నిజమైంది. ఈ సినిమాలో చిరంజీవి సరసన నాయికగా 'త్రిష'నే మెరవనుంది. తాజా షెడ్యూల్లో పాల్గొనడం కోసం ఆమె ఈ రోజున సెట్లోకి అడుగుపెట్టింది. మెగాస్టార్ ఆమెకి బొకేను అందించగా, ఈ సినిమా టీమ్ ఆమెకి వెల్ కమ్ చెప్పింది. 

ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి, గ్రాఫిక్స్ తో ముడిపడిన కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరించారు. ఆ సన్నివేశాలకు సంబంధించిన గాఫిక్స్ వర్క్ ఒక వైపున నడుస్తూనే ఉంది. ఇక మరో వైపున ఈ సినిమా షూటింగు వేగాన్ని పెంచారు. తాజా షెడ్యూల్లో చిరంజీవి - త్రిష కాంబినేషన్లోని సన్నివేశాలను చిత్రీకరించనున్నారు.

గతంలో చిరంజీవి - త్రిష కాంబినేషన్లో వచ్చిన 'స్టాలిన్' భారీ విజయాన్ని నమోదు చేసింది. ఇక చాలా గ్యాప్ తరువాత ఫాంటసీ జోనర్లో చిరంజీవి చేస్తున్న సినిమా కావడం వలన అందరిలో ఆసక్తి పెరుగుతూ పోతోంది. యూవీ క్రియేషన్స్ వారు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాను, వచ్చే సంక్రాంతి కానుకగా జనవరి 10వ తేదీన విడుదల చేయనున్నారు.

More Telugu News