Mahesh Babu: ఈ నెల 9వ తేదీన ఓటీటీ సెంటర్లో సందడి చేసే సినిమాలివే!

  • ఈ శుక్రవారం ఓటీటీల్లో తెలుగు సినిమాల సందడి 
  • 9వ తేదీన నెట్ ఫ్లిక్స్ లో 'గుంటూరు కారం' 
  •  అమెజాన్ ప్రైమ్ లో 'కెప్టెన్ మిల్లర్'
  •  అదే రోజున 'ఆహా' వేదికపై 'బబుల్ గమ్'

OTT Movies Update

ఈ వారం ఓటీటీ సెంటర్లో సందడి కాస్త ఎక్కువగానే కనిపిస్తోంది. ఈ శుక్రవారం రోజున తెలుగు సినిమాల జోరు గట్టిగానే అనిపిస్తోంది. ఆ జాబితాలో ముందుగా 'గుంటూరు కారం' కనిపిస్తోంది. త్రివిక్రమ్ - మహేశ్ బాబు కాంబినేషన్లో రూపొందిన ఈ సినిమా, జనవరి 12వ తేదీన థియేటర్లకు వచ్చింది. కథానాయికగా శ్రీలీల సందడి చేసిన ఈ సినిమా, ఈ నెల 9వ తేదీ నుంచి 'నెట్ ఫ్లిక్స్'లో స్ట్రీమింగ్ కానుంది. ధనుశ్ హీరోగా రూపొందిన 'కెప్టెన్ మిల్లర్' సినిమా జనవరి 26వ తేదీన థియేటర్లకు వచ్చింది. తమిళంలో యావరేజ్ అనిపించుకున్న ఈ సినిమా, ఇక్కడి ఆడియన్స్ కి ఆశించిన స్థాయిలో కనెక్ట్ కాలేదు. ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులను అమెజాన్ ప్రైమ్ వారు దక్కించుకున్నారు. ప్రియాంక అరుళ్ మోహన్ ముఖ్యమైన పాత్రను పోషించిన ఈ సినిమా, ఈ నెల 9వ తేదీ నుంచి ఓటీటీ ప్రేక్షకులకు అందుబాటులోకి రానుంది.ఇక సుమ - రాజీవ్ కనకాల తనయుడు 'బబుల్ గమ్' సినిమాతో హీరోగా పరిచయమైన సంగతి తెలిసిందే. ఈ సినిమాకి థియేటర్ల నుంచి అంతగా రెస్పాన్స్ రాలేదు. ఈ నెల 9వ తేదీ నుంచి, 'ఆహా' ఫ్లాట్ ఫామ్ పైకి రానుంది. మానస చౌదరి కథానాయికగా కనిపించిన ఈ సినిమాకి, రవికాంత్ పేరెపు దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలకి ఓటీటీ వైపు నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందనేది చూడాలి. 

More Telugu News