Vijayawada: విజయవాడలోని సాయిబాబా మందిరానికి లక్ష రూపాయల విరాళమిచ్చిన యాచకుడు

  • ఇప్పటి వరకు రూ. 8.54 లక్షల విరాళం అందించిన యాదిరెడ్డి
  • ఆలయం వద్దే భిక్షాటన
  • ఇకపైనా ప్రతీ రూపాయి దైవకార్యానికే వెచ్చిస్తానని వెల్లడి
Beggar Gave One Lakh Donation To Mutyalapadu Saibaba Temple

విజయవాడ ముత్యాలంపాడులోని సాయిబాబా మందిరానికి ఓ యాచకుడు లక్ష రూపాయల విరాళం ఇచ్చాడు. ఆలయం వద్ద బిచ్చమెత్తుకుని జీవించే యాదిరెడ్డి మందిర అభివృద్ధికి తనవంతు సాయంలో భాగంగా ఈ విరాళం ఇచ్చారు. మందిరం గౌరవాధ్యక్షుడు గౌతమ్‌రెడ్డికి నిన్న ఆ సొమ్ము అందించారు.

ఆలయం వద్ద భిక్షాటన చేస్తూ సంపాదించే సొమ్మును తిరిగి స్వామికే ఇవ్వడం ఆనందంగా ఉందని, ఇకపైనా ప్రతీ రూపాయి దైవ కార్యానికే అందిస్తానని ఈ సందర్భంగా యాదిరెడ్డి తెలిపారు. తన జీవితం బాబా సేవకే అంకితమన్న ఆయన ఆలయ అభివృద్ధికి ఇప్పటి వరకు రూ. 8.54 లక్షల విరాళం ఇవ్వడం గమనార్హం.

More Telugu News