Visakhapatnam Test: విశాఖ టెస్ట్ మ్యాచ్.. బ్యాటింగ్ ప్రారంభించిన టీమిండియా

  • టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇండియా
  • ఈ మ్యాచ్ ద్వారా అరంగేట్రం చేస్తున్న రజత్ పటిదార్
  • ఇండియా స్కోరు.. 4 ఓవర్లకు 13 పరుగులు
India won the toss and elected bat in Visakhapatnam test against England

విశాఖలో ఇండియా - ఇంగ్లాండ్ జట్ల మధ్య రెండో టెస్ట్ మ్యాచ్ ప్రారంభమయింది. టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ ఇన్నింగ్స్ ను ప్రారంభించారు. ప్రస్తుతం ఇండియా స్కోరు 4 ఓవర్లకు 13 పరుగులు. జైస్వాల్ 9 పరుగులు, రోహిత్ 4 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఈ మ్యాచ్ ద్వారా రజత్ పటిదార్ ఆరంగేట్రం చేస్తున్నాడు. సర్ఫరాజ్ కు తుది జట్టులో అవకాశం దక్కలేదు. 

ఇండియా జట్టు: యశస్వి జైశ్వాల్, రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్ మన్ గిల్, రజత్ పటిదార్, శ్రేయస్ అయ్యర్, శ్రీకర్ భరత్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, అక్సర్ పటేల్, బుమ్రా, ముఖేశ్ కుమార్, కుల్దీప్ యాదవ్. 

ఇంగ్లాండ్ జట్టు: జాక్ క్రాలే, బెన్ డకెట్, జో రూట్, బెయిర్ స్టో, బెన్ స్టోక్స్ (కెప్టెన్), బెన్ ఫోక్స్ (వికెట్ కీపర్), రెహాన్, హార్ట్ లీ, షోయబ్ బషీర్, జేమ్స్ అండర్సన్.

More Telugu News