Visakhapatnam: విశాఖ నుంచి బ్యాంకాక్, కౌలాలంపూర్ కు నేరుగా విమాన సర్వీసులు

  • విశాఖ ఎయిర్ పోర్టు నుంచి విదేశాలకు విమానాలు
  • ఏప్రిల్ నుంచి బ్యాంకాక్, కౌలాలంపూర్ కు సర్వీసులు
  • ప్రణాళికలు రూపొందించిన ఎయిర్ ఏషియా
  • త్వరలో విశాఖ-దుబాయ్ మధ్య మరో ఎయిరిండియా విమాన సర్వీసు
Air Asia plans to run flights to Bangkok and Kuala Lumpur from Visakha

విశాఖ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి విదేశాలకు విమాన సర్వీసుల సంఖ్య పెరగనుంది. విశాఖ నుంచి బ్యాంకాక్, కౌలాలంపూర్ నగరాలకు నేరుగా విమాన సర్వీసులు నడపనున్నారు. 

ఏప్రిల్ నుంచి విశాఖ నుంచి ఈ రెండు ఆగ్నేయాసియా నగరాలకు ఎయిర్ ఏషియా ఎయిర్ లైన్స్ సంస్థ విమానాలు నడపాలని నిర్ణయించింది. ఏప్రిల్ 9 నుంచి విశాఖ-బ్యాంకాక్ విమాన సర్వీసు... ఏప్రిల్ 26 నుంచి విశాఖ-కౌలాలంపూర్ విమాన సర్వీసు నడిపేందుకు ఎయిర్ ఏషియా ప్రణాళికలు రూపొందింది. 

అంతేకాదు, విశాఖ-హైదరాబాద్ మధ్య త్వరలోనే మరో ఎయిరిండియా సర్వీసు ప్రారంభం కానుంది. జూన్ నాటికి విశాఖ-దుబాయ్ మధ్య మరో ఎయిరిండియా విమాన సర్వీసును అందుబాటులోకి తీసుకురానున్నారు. 

విశాఖ విమానాశ్రయం రన్ వే ఆధునికీకరణ పనులు మార్చి 31 నాటికి పూర్తవుతాయి. ఏప్రిల్ నుంచి విశాఖ ఎయిర్ పోర్టులో పూర్తి స్థాయిలో విమానాల రాకపోకలు జరగనున్నాయి.

More Telugu News