Tahasildars: ఏపీ వ్యాప్తంగా భారీ ఎత్తున తహసీల్దార్ల బదిలీలు

  • త్వరలో సాధారణ ఎన్నికలు
  • కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో బదిలీలు
  • నాలుగు జోన్లలో తహసీల్దార్లకు స్థానచలనం
Tahasildars transfers takes place in AP

కొన్ని నెలల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో, ఏపీ వ్యాప్తంగా భారీగా తహసీల్దార్ల బదిలీల ప్రక్రియకు తెరలేచింది. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఈ బదిలీలు చేపట్టారు. ప్రస్తుతం జోన్-1, జోన్-2, జోన్-3, జోన్-4లోని తహసీల్దార్లను బదిలీ చేస్తున్నారు. జోన్-1లో 137 మంది, జోన్-2లో 170 మంది, జోన్-3లో 154 మంది, జోన్-4లో 249 మంది తహసీల్దార్లకు స్థానచలనం కలుగుతోంది. తహసీల్దార్లను బదిలీ చేస్తూ భూపరిపాలన ప్రధాన కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు.

More Telugu News