ICC Under-19 World Cup: అండర్-19 వరల్డ్ కప్: న్యూజిలాండ్ పై భారత కుర్రాళ్ల భారీ స్కోరు

  • దక్షిణాఫ్రికాలో అండర్-19 వరల్డ్ కప్
  • బ్లూంఫోంటీన్ లో నేడు భారత్ × న్యూజిలాండ్
  • టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్
  • నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 295 పరుగులు చేసిన భారత్
Indian lads posts huge total against New Zealand in Under 19 World Cup

దక్షిణాఫ్రికాలో నిర్వహిస్తున్న ఐసీసీ అండర్-19 వరల్డ్ కప్ లో నేడు భారత్, న్యూజిలాండ్ జట్లు తలపడుతున్నాయి. బ్లూంఫోంటీన్ లో జరుగుతున్న ఈ మ్యాచ్ లో న్యూజిలాండ్ జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దాంతో మొదట బ్యాటింగ్  చేపట్టిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 295 పరుగులు చేసింది. 

వన్ డౌన్ బ్యాట్స్ మన్ ముషీర్ ఖాన్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. ముషీర్ 126 బంతుల్లో 131 పరుగులు చేశాడు. అతడి స్కోరులో 13 ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి. ఓపెనర్ ఆదర్శ్ సింగ్ 52, కెప్టెన్ ఉదయ్ సహారన్ 34 పరుగులు చేశారు. తెలుగుతేజం, వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ ఆరవెల్లి అవినాశ్ 2 సిక్సులు బాది 17 పరుగులు చేశాడు. 

న్యూజిలాండ్ బౌలర్లలో మాసన్ క్లార్క్ 4 వికెట్లు తీశాడు. ర్యాన్ సొర్గాస్ 1, ఇవాల్డ్ ష్రూడర్ 1, జాక్ కమ్మింగ్ 1, ఒలివర్ తెవాటియా 1 వికెట్ పడగొట్టారు.

More Telugu News