అమెరికాలో అదృశ్యమైన భారత విద్యార్థి మృతి.. నిర్ధారించిన యూనివర్సిటీ
- పర్డ్యూ యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్ చదువుతున్న నీల్ ఆచార్య
- ఆదివారం నుంచి ఆచూకీ గల్లంతు
- ఎక్స్లో సాయం కోరిన ఆచార్య తల్లి
- యూనివర్సిటీతో టచ్లో ఉన్నామన్న భారత రాయబార కార్యాలయం
ఈ నెల 28 నుంచి కనిపించకుండా పోయిన తన కుమారుడి ఆచూకీ చెప్పాలంటూ ఆచార్య తల్లి గౌరీ ఆచార్య ఎక్స్ ద్వారా సాయం కోరడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఆచార్యను చివరిసారి ఉబెర్ డ్రైవర్ చూశాడు. యూనివర్సిటీ వద్ద ఆచార్యను వదిలిపెట్టింది అతడే. ఆ తర్వాతి నుంచి విద్యార్థి ఆచూకీ మాయమైంది. ఆచార్య తల్లి పోస్టుకు స్పందించిన షికాగోలోని భారత కాన్సులేట్ జనరల్.. యూనివర్సిటీ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలిపింది. అవసరమైన సాయం అందిస్తామని పేర్కొంది.