Nadendla Manohar: జనసేన ప్రెస్ మీట్లో నాదెండ్ల పక్కన ఎవరు కూర్చున్నారో చూడండి!

  • ఆసక్తికర ప్రెస్ మీట్ నిర్వహించిన నాదెండ్ల
  • నాదెండ్ల పక్కన ఖాళీగా కనిపించిన కుర్చీ
  • సీఎం జగన్ చిత్రపటాన్ని తీసుకువచ్చి పెట్టిన జనసేన శ్రేణులు
  • మీడియా ముందుకు రాని సీఎంను ఈ విధంగా తీసుకువచ్చామని వెల్లడి 
Is CM Jagan really sits beside Nadendla Manohar in Janasena Press Meet

జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఇవాళ ఓ ఆసక్తికర ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ మీడియా సమావేశంలో నాదెండ్ల సహా జనసేన అగ్రనేతలు వేదికపై వరుసగా కూర్చున్నారు. 

అయితే, నాదెండ్ల పక్కన కుర్చీని ఖాళీగా ఉంచారు. ఈ కుర్చీలో ఎవరు కూర్చుంటారో చెప్పుకోండి? అంటూ జనసేన శతఘ్ని దీనిపై ఓ ట్వీట్ కూడా చేసింది. ఒకవేళ జనసేనాని పవన్ కల్యాణ్ కూడా ఆ ప్రెస్ మీట్ కు వస్తున్నారేమోనని అందరూ భావించారు. 

కానీ, ఇంతలో సీఎం జగన్ చిత్రపటాన్ని తీసుకువచ్చి ఆ ఖాళీ కుర్చీలో పెట్టారు. 'ఏనాడూ మీడియా ముఖం చూడని ముఖ్యమంత్రిని మీడియా ముందుకు తీసుకువచ్చిన జనసేన' అంటూ వెంటనే జనసేన పార్టీ దీనిపై ఓ వీడియో రిలీజ్ చేసింది. 

ఇక, ఈ ప్రెస్ మీట్ సందర్భంగా... నాదెండ్ల మనోహర్ సీఎం జగన్ కు బహిరంగ సవాల్ విసిరారు. "మీ ప్రభుత్వ లెక్కల్లో తప్పులపై చర్చించేందుకు మేము 'సిద్ధం'... మీరు సిద్ధమా? దమ్ముంటే చర్చకు రావాలి" అని స్పష్టం చేశారు.

More Telugu News