Chandrababu: తొడలు కొడతాడు, మీసం మెలేస్తాడు... పాపం, ఈ వైసీపీ నేతకు సీటెక్కడో తెలియదు: చంద్రబాబు

Chandrababu slams YCP MLA Anil Kumar Yadav

  • నెల్లూరులో రా కదలిరా సభ
  • హాజరైన చంద్రబాబు
  • స్థానిక ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ పై విమర్శనాస్త్రాలు
  • ప్రజలు అతడ్ని ఛీ కొడుతున్నారని వెల్లడి
  • అందుకే సీఎం అతడ్ని ఎక్కడికో పంపిస్తున్నాడని ఎద్దేవా

నెల్లూరులో నిర్వహించిన రా కదలిరా సభలో టీడీపీ అధినేత చంద్రబాబు స్థానిక ఎమ్మెల్యే, మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ వైసీపీ నేతకు సీటెక్కడో తెలియదని ఎద్దేవా చేశారు. 

"ఇక్కడొక ఎమ్మెల్యే ఉన్నాడు... అనిల్ కుమార్! అభివృద్ధి నిల్లు... మాటలు ఫుల్లు. ఇతని గురించి చెప్పాలంటే చాలా  సమయం పడుతుంది. పోలవరం గురించి మాట్లాడితే పర్సెంటా, హాఫ్ పర్సెంటా అంటాడు. పోలవరం ఎప్పుడు పూర్తి చేస్తావంటే, బుల్లెట్ దిగుతుందంటాడు. నీటి పారుదల గురించి తెలియని నోటి పారుదల నేత ఈయన... అది మన ఖర్మ! 

ఈయన తొడలు కొడతాడు, మీసం మెలేస్తాడు, పిచ్చి పిచ్చిగా మాట్లాడతాడు, గావుకేకలు పెడతాడు... కానీ అభివృద్ధి గురించి అడిగితే నోరు కూడా తెరవడు... ఈయనొక పెద్ద ఎమ్మెల్యే! 

దొంతాలి వద్ద బినామీల పేరుతో రూ.100 కోట్ల విలువ చేసే 50 ఎకరాల ఆస్తి కొట్టేశాడు. నాయుడుపేటలో బినామీల పేర్లతో 58 ఎకరాలు కొట్టేశాడు. ఇస్కాన్ సిటీలో బినామీల పేర్లతో 87 ఎకరాలు కొట్టేశాడు. 

ఇవన్నీ చూసి ఇక్కడి ప్రజలు ఛీ కొడుతుంటే... ముఖ్యమంత్రి ఇతనికి సీటు లేదని చీటీ చించేశాడు. ఇక్కడ్నించి ఎక్కడికో పంపిస్తాడట ఇతడ్ని. ఇంకా గాల్లో ఊగిసలాడుతున్నాడు" అంటూ చంద్రబాబు వ్యాఖ్యానించారు.

Chandrababu
Anil Kumar Yadav
Raa Kadali Raa
Nellore
TDP
YSRCP
  • Loading...

More Telugu News