Padma Sri: పద్మశ్రీ పురస్కారాలు ప్రకటించిన కేంద్రం... పలువురు తెలుగు వారికి అవార్డులు

  • అన్ సంగ్ హీరోస్ పేరిట కేంద్రం పద్మశ్రీ పురస్కారాలు
  • ఈ ఏడాది 34 మందికి అవార్డులు
  • తెలంగాణ నుంచి ఇద్దరు, ఏపీ నుంచి ఒకరికి అవార్డు 
Center announces Padmasri awards

కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాలు ప్రకటించింది. 'గుర్తింపుకు నోచుకోని నాయకులు' (అన్ సంగ్ హీరోస్) పేరిట 34 మందికి పద్మశ్రీ అవార్డులు ప్రకటించారు. వీరిలో పలువురు తెలుగువారు కూడా ఉన్నారు.

పద్మశ్రీ గ్రహీతల జాబితా...

కళలు
దాసరి కొండప్ప- తెలంగాణ (బుర్ర వీణ)
డి.ఉమామహేశ్వరి- ఏపీ (హరికథా గానం)
గడ్డం సమ్మయ్య- తెలంగాణ (యక్షగానం)
నేపాల్ చంద్ర సూత్రధార్- పశ్చిమ బెంగాల్
జానకీలాల్- రాజస్థాన్
బాబూ రామ్ యాదవ్- ఉత్తరప్రదేశ్
గోపీనాథ్ స్వైన్- ఒడిశా
బాలకృష్ణ సాధనమ్ పుథియ వీతిల్- కేరళ
స్మృతి రేఖ ఛక్మా- త్రిపుర
అశోక్ కుమార్ బిశ్వాస్- బీహార్
ఓంప్రకాశ్ శర్మ- మధ్యప్రదేశ్
రతన్ కహార్- పశ్చిమ బెంగాల్
నారాయణన్ ఈపీ- కేరళ
శాంతిదేవి పాశ్వాన్, శివన్ పాశ్వాన్- బీహార్
భాగబత్ పదాన్- ఒడిశా
మచిహన్ సాసా- మణిపూర్
సనాతన్ రుద్రపాల్- పశ్చిమ బెంగాల్
జోర్డాన్ లేప్పా- సిక్కిం
భద్రప్పన్ ఎం- తమిళనాడు

క్రీడలు
ఉదయ్ విశ్వనాథ్ దేశ్ పాండే- మహారాష్ట్ర

వైద్య రంగం
యజ్జీ మాణిక్ షా ఇటాలియా- గుజరాత్
హేమచంద్ మాంఝీ- ఛత్తీస్ గఢ్
ప్రేమ ధన్ రాజ్- కర్ణాటక

సామాజిక సేవా రంగం
దుఖు మాఝీ- పశ్చిమ బెంగాల్
సోమన్న- కర్ణాటక
సంగ్ధాన్ కిమా- మిజోరం
పార్బతి బారువా- అసోం
గుర్విందర్ సింగ్- హర్యానా
ఛామి ముర్మూ- ఝార్ఖండ్
జగేశ్వర్ యాదవ్- ఛత్తీస్ గఢ్

ఇతర రంగాలు
సత్యనారాయణ బెలేరి- కేరళ
కె.చెల్లమ్మాళ్- అండమాన్ అండ్ నికోబార్
యనుంగ్ జామె లెగో- అరుణాచల్ ప్రదేశ్
సర్బేశ్వర్ బాసుమతరి- అసోం

More Telugu News