రాముడి గుడి కోసం 14 ఏళ్ల బాలిక రూ.52 లక్షల విరాళం
- అయోధ్య రామ మందిర నిర్మాణంలో సూరత్ బాలిక
- రామాయణ పారాయణంతో విరాళాల సేకరణ
- మూడేళ్లలో 50 వేల కి.మీ. ప్రయాణించిన భవికా మహేశ్వరి
ఈ క్రమంలో రామ మందిర నిర్మాణానికి ఓ చిన్నారి కూడా తన వంతుగా విరాళం అందజేసింది. రామాయణ పారాయణ చేస్తూ దేశవ్యాప్తంగా 50 వేల కిలోమీటర్లు తిరిగి రూ.52 లక్షలు సేకరించి రాముడికి సమర్పించింది. సూరత్ కు చెందిన భవికా మహేశ్వరి పదకొండేళ్ల వయసులో విరాళాల సేకరణ మొదలుపెట్టింది. మూడేళ్ల పాటు దేశంలోని వివిధ నగరాలలో రామాయణ పారాయణం, ఆధ్యాత్మిక ప్రసంగాలు చేస్తూ విరాళాలు సేకరించింది. బహిరంగ సభలలో, కరోనా సమయంలో ఐసోలేషన్ సెంటర్లలో, జైళ్లలోనూ రామాయణ పురాణ పఠనం చేసింది. 2021లో లాజ్ పూర్ జైలులో ఖైదీలకు రామాయణం వినిపించగా.. 3200 మంది ఖైదీలు రూ.లక్ష విరాళంగా అందించారు. ఇలా మూడేళ్లపాటు దేశమంతా తిరుగుతూ రూ.52 లక్షల విరాళాలు సేకరించి శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టుకు అందజేసింది.