Alla Ramakrishna Reddy: షర్మిల సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి

  • ఏపీ కాంగ్రెస్ చీఫ్ గా వైఎస్ షర్మిల నియామకం
  • నేడు పదవీ బాధ్యతలు చేపట్టిన షర్మిల
  • విజయవాడ ఆంధ్రరత్న భవన్ లో కార్యక్రమం
  • ఇదే కార్యక్రమంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్న ఆర్కే
  • సాదరంగా పార్టీలోకి ఆహ్వానించిన షర్మిల
Mangalagiri MLA Alla Ramakrishna Reddy joins Congress Party

వైఎస్ షర్మిల ఇవాళ ఏపీ కాంగ్రెస్ చీఫ్ గా బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే. విజయవాడ ఆంధ్రరత్న భవన్ లో జరిగిన కార్యక్రమంలో ఆమె పీసీసీ అధ్యక్షురాలిగా పగ్గాలు అందుకున్నారు. ఈ కార్యక్రమంలోనే మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఏపీ కాంగ్రెస్ నూతన అధ్యక్షురాలు షర్మిల సమక్షంలో ఆర్కే కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆర్కేకు కాంగ్రెస్ కండువా కప్పిన షర్మిల ఆయనకు పార్టీలోకి సాదర స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కార్యకర్తలు షర్మిలను ఉద్దేశించి సీఎం సీఎం అంటూ నినాదాలు చేశారు. 

మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే గత కొంతకాలంగా వైసీపీపై అసంతృప్తితో ఉన్నారు. ఇటీవలే ఆయన పార్టీకి రాజీనామా చేశారు. తాను షర్మిలతో పాటే రాజకీయ ప్రయాణం సాగిస్తానని, ఆమె ఏ పార్టీలోకి వెళితే తాను కూడా ఆ పార్టీలోకి వెళతానని కొన్నిరోజుల కిందటే ప్రకటించారు.

More Telugu News