Pawan Kalyan: లక్నో చేరుకున్న పవన్ కల్యాణ్

  • జనవరి 22న అయోధ్యలో రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ
  • హాజరవుతున్న పవన్ కల్యాణ్
  • 500 ఏళ్ల తర్వాత ప్రజల కల సాకారమవుతోందని వెల్లడి 
Pawan Kalyan arrives Lucknow

జనసేనాని పవన్ కల్యాణ్ ఉత్తరప్రదేశ్ లోని లక్నో చేరుకున్నారు. పవన్ కల్యాణ్ రేపు అయోధ్యలో రామ మందిర ప్రాణ ప్రతిష్ఠాపన కార్యక్రమానికి హాజరుకానున్నారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ స్పందిస్తూ, దేశ ప్రజల సుదీర్ఘ కల నెరవేరబోతోందని తెలిపారు. 500 ఏళ్ల తర్వాత ప్రజల కల సాకారం అవుతోందని పేర్కొన్నారు. రామ మందిర ప్రారంభోత్సవంలో పాల్గొంటుండడం చాలా సంతోషం కలిగిస్తోందని వివరించారు.

More Telugu News