Boat: గుజరాత్ లో విషాదం... పిక్నిక్ కు వెళ్లి 18 మంది మృత్యువాత

  • హరిణి సరస్సు వద్దకు విద్యార్థులను పిక్నిక్ కు తీసుకెళ్లిన స్కూలు
  • పడవలో ఎక్కిన 27 మంది
  • తిరగబడిన పడవ
  • 16 మంది విద్యార్థులు, ఇద్దరు టీచర్ల మృతి 
18 People died in Gujarat boat over turn incident

గుజరాత్ లో విషాద ఘటన చోటుచేసుకుంది. పిక్నిక్ కు వెళ్లిన 16 మంది విద్యార్థులు, ఇద్దరు టీచర్లు నీట మునిగి ప్రాణాలు కోల్పోయారు. వడోదరలోని హరిణి సరస్సులో ఈ దుర్ఘటన జరిగింది. 

వడోదరకు చెందిన ఓ ప్రైవేటు పాఠశాల తమ విద్యార్థులను హరిణి సరస్సు వద్దకు విహారయాత్రకు తీసుకెళ్లింది. విద్యార్థులు సరస్సులో విహరించేందుకు ఓ పడవ ఎక్కారు. వారితో పాటే ఉపాధ్యాయులు కూడా ఎక్కారు. పడవ సరస్సులో కొంతదూరం వెళ్లగానే తిరగబడింది. ఆ సమయంలో పడవలో 27 మంది ఉన్నారు. వారిలో 18 మంది మృత్యువాత పడ్డారు. ఈత రాకపోవడంతో నీటిలో మునిగిపోయారు. కొందరిని బోటింగ్ సంస్థ సిబ్బంది కాపాడారు. 

ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సామర్థ్యానికి మించి పడవలో ఎక్కువ మందిని ఎక్కించడం వల్లే ఈ దుర్ఘటన జరిగి ఉంటుందని భావిస్తున్నారు. కాగా, పడవలో ఎక్కినవారికి లైఫ్ జాకెట్లు కూడా లేవని తెలుస్తోంది.

More Telugu News