Stock Market: ఈరోజు కూడా నష్టాల్లోనే ముగిసిన మార్కెట్లు

  • మన మార్కెట్లపై అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూలతలు
  • 313 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
  • 109 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ
Markets ends in losses

దేశీయ స్టాక్ మార్కెట్లలో నష్టాల పర్వం కొనసాగుతోంది. ఈ రోజు కూడా మార్కెట్లు నష్టాలను మూటకట్టుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని ప్రతికూల సంకేతాలు మన మార్కెట్లపై ప్రభావం చూపుతున్నాయి. ఈ క్రమంలో ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 313 పాయింట్లు నష్టపోయి 71,186కి పడిపోయింది. నిఫ్టీ 109 పాయింట్లు కోల్పోయి 21,462కి దిగజారింది. 

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
సన్ ఫార్మా (2.86%), టెక్ మహీంద్రా (2.16%), టాటా మోటార్స్ (1.72%), మహీంద్రా అండ్ మహీంద్రా (1.18%), యాక్సిస్ బ్యాంక్ (1.03%). 

టాప్ లూజర్స్:
ఎన్టీపీసీ (-3.12%), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (-2.99%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (-2.47%), టైటాన్ (-2.31%), ఏసియన్ పెయింట్స్ (-2.08%).

More Telugu News