Peddireddi Ramachandra Reddy: అయ్యప్పస్వామికి బంగారు ఆభరణాలు సమర్పించిన మంత్రి పెద్దిరెడ్డి... ఫొటోలు ఇవిగో!

  • కోటమలై అయ్యప్పస్వామి క్షేత్రంలో నిన్న మకరజ్యోతి
  • భారీ ఊరేగింపుతో తరలివచ్చిన పెద్దిరెడ్డి 
  • హాజరైన ఎంపీ మిథున్ రెడ్డి, తదితర కుటుంబ సభ్యులు
Minister Peddireddy offers gold ornaments to Kotamalai Ayyappa Swamy

సంక్రాంతి రోజున అయ్యప్ప ఆలయాల్లో మకర జ్యోతి దర్శనం జరుగుతుంది. కాగా, పుంగనూరు నియోజకవర్గంలోని సదుం మండలంలో యరాత్రి వారి పల్లిలో  కోటమలై అయ్యప్పస్వామి దేవస్థానంలోనూ ఘనంగా మకరజ్యోతి వేడుకలు జరిగాయి. 

ఈ సందర్భంగా, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం కోటమలై అయ్యప్పస్వామికి బంగారు ఆభరణాలు సమర్పించింది. ఊరేగింపుగా, మేళతాళాల నడుమ మంత్రి పెద్దిరెడ్డి బంగారు ఆభరణాల పెట్టెను తలపై పెట్టుకుని ఆలయం వరకు తీసుకువచ్చారు. ఈ కార్యక్రమంలో పెద్దిరెడ్డి తనయుడు, రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి తదితర కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

More Telugu News