Chandrababu: ఉండవల్లిలో ముగిసిన చంద్రబాబు, పవన్ కల్యాణ్ సమావేశం

  • ఉండవల్లిలో చంద్రబాబు నివాసానికి వచ్చిన పవన్
  • మూడున్నర గంటల పాటు సమావేశం
  • ఎన్నికలే ప్రధాన అజెండగా భేటీ
  • 12 అంశాలతో ఉమ్మడి మేనిఫెస్టో ఖరారు
  • ఈ నెలలో మేనిఫెస్టో ప్రకటన
Chandrababu and Pawan Kalyan has discusses many issues

టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్ ల సమావేశం ముగిసింది. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో దాదాపు మూడున్నర గంటలపాటు ఈ సమావేశం సాగింది. ఈ కీలక భేటీలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్, జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ కూడా పాల్గొన్నారు. 

కాగా, ఈ సమావేశంలో ఎన్నికలే ప్రధాన అజెండాగా చర్చలు సాగాయి. 12 అంశాలతో టీడీపీ-జనసేన ఉమ్మడి మేనిఫెస్టోను చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఖరారు చేశారు. 

టీడీపీ ఇప్పటికే 'సూపర్ సిక్స్' పేరుతో మేనిఫెస్టో అంశాలను ప్రకటించగా, ఇప్పుడు వాటికి జనసేన 'షణ్ముఖ వ్యూహం' మరో ఆరు అంశాలను జోడించింది. ఈ నెలలోనే ఉమ్మడి మేనిఫెస్టో విడుదల చేయనున్నారు. పొత్తులో అత్యంత కీలకమైన సీట్ల సర్దుబాటు విషయం కూడా చర్చించారు. దీనిపై త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశాలున్నాయి.

More Telugu News