మమ్మల్ని ఎవరూ బెదిరించడాన్ని అనుమతించేది లేదు: మాల్దీవుల అధ్యక్షుడి హెచ్చరిక

Nobody has license to bully us says Maldivian President
  • పరోక్షంగా భారత్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించిన మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్ మొయిజ్జు
  • మాది చిన్న దేశమే కావొచ్చు.. కానీ బెదిరించే లైసెన్స్ ఇవ్వలేదని వ్యాఖ్య
  • ఇండియన్ ఓసియన్ ఏ ఒక్క దేశానికి సంబంధించినది కాదన్న అధ్యక్షుడు
అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత చైనాలో తన మొదటి అంతర్జాతీయ పర్యటనను చేసి వచ్చిన తర్వాత మాల్దీవుల అధ్యక్షుడు డాక్టర్ మొహమ్మద్ ముయిజ్జు భారత్‌పై మరోసారి పరోక్షంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మరో దేశం తమను బెదిరించడాన్ని లేదా అవమానించడాన్ని అనుమతించేది లేదన్నారు. 'మాది చిన్న దేశమే కావొచ్చు.. కానీ మమ్మల్ని బెదిరించే లైసెన్స్ మీకు ఇవ్వలేదు' అని ఆయన వ్యాఖ్యానించారు. అయితే ఆయన వ్యాఖ్యలపై భారత్ నుంచి ఇంకా ఎలాంటి స్పందన వెలువడలేదు.

హిందూ మహాసముద్రం ఏ ఒక్క దేశానికీ చెందినది కాదన్నారు. తమ దేశం చిన్న చిన్న ద్వీపాల సమూహం అయినప్పటికీ  900,000 చదరపు కిలో మీటర్ల విస్తారమైన ప్రత్యేక ఆర్థిక మండలిని కలిగి ఉన్నామన్నారు. ఈ మహా సముద్రంలో అత్యధిక వాటాను కలిగి ఉన్న దేశాలలో మాల్దీవులు ఒకటి అన్నారు. మాల్దీవులు స్వతంత్ర, సార్వభౌమ రాజ్యమన్నారు. మాల్దీవుల దేశీయ వ్యవహారాలపై చైనా ప్రభావం ఉండదని స్పష్టం చేశారు.
Go Back to Shorts
maldives
India

More Telugu News